శ్రీ దత్తత్రేయస్వామి మందిరంలో ఉదయం స్వామి వారి హారతులు| AP MAAYURI NEWS

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • శ్రీ దత్తత్రేయస్వామి మందిరంలో ఉదయం స్వామి వారి హారతులు
    మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
    చిరు బోధ!..
    శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందాలని నిర్ణయం తీసుకునే ముందు తాము సజీవ సమాధి చెందాలని అభిలషించారు.. తనను సజీవంగా సమాధి చేయమని మా తల్లిదండ్రులైన శ్రీధరరావు, నిర్మలప్రభావతి గార్లకు, శ్రీ చక్కా కేశవులు గారికి, శ్రీ మీరాశెట్టి గారికి చాలా సార్లు చెప్పారు..వారెవరూ కూడా ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు..శ్రీ స్వామివారిని అటువంటి నిర్ణయం తీసుకోవద్దని బ్రతిమలాడారు..తామెవ్వరమూ ఆ పని తమ చేతులతో చేయలేమని ఖరాఖండిగా చెప్పేసారు..శ్రీ స్వామివారు మాత్రం.."సమయం అయిపోయింది..నేను వచ్చిన కార్యం కూడా పూర్తి అయింది..ఇక ఎక్కువ రోజులు నేను ఇక్కడ వుండటానికి లేదు..అది మీరు గ్రహించాలి.." అని చెప్పసాగారు..
    ఈ సంప్రదింపులు ఇలా జరుగుతున్న సమయం లో శ్రీ స్వామివారు తమ సాధనను తీవ్రం చేశారు..కఠోర తపస్సు చేయసాగారు..ఆహారం తీసుకోవడం దాదాపుగా మానివేశారు..తరచూ వచ్చి తనను కలవొద్దని మా తల్లిదండ్రులకు చెప్పారు..ఏదైనా అవసరం కలిగితే తానే కబురు చేస్తానని కూడా చెప్పారు..శ్రీ స్వామివారు ఆహారం తీసుకున్నా..తీసుకోకపోయినా..నా చేత మాత్రం ఆహారాన్ని స్టీలు కారియర్ ద్వారా మా అమ్మగారు పంపించేవారు..ఆశ్రమం లోని వంటగది వద్ద ఆ కారియర్ ను ఉంచి నేను మా పొలానికి వెళ్ళేవాడిని..తిరిగి వచ్చేసమయానికి ఆ కారియర్ ఎక్కడ నేను పెట్టానో అక్కడే ఉండేది..వెనక్కు తీసుకొచ్చేసేవాడిని..ఒక్కొక్కసారి మాత్రం శ్రీ స్వామివారు తాను ధ్యానం నుండి లేచిన తరువాత..కారియర్ లోని ఆహారాన్ని కొద్దిగా తీసుకుని..శుభ్రంగా కడిగి పెట్టేవారు..శ్రీ స్వామివారు ఆరోజు ఆహారం స్వీకరించారు అనుకోవడానికి అదే గుర్తు నాకు..
    ఒకరోజు విజయవాడ నుంచి మల్లికార్జున రావు గారని ఒక సిద్దాంతి గారిని శ్రీ చెక్కా కేశవులు గారు మొగలిచెర్ల కు పంపారు..శ్రీ మల్లికార్జున రావు గారు దేవాలయాల ప్రతిష్టలు బాగా చేస్తారని పేరు.. శ్రీ చెక్కా కేశవులు గారి ద్వారా శ్రీ స్వామివారి గురించి విని..శ్రీ స్వామివారిని చూడాలనే కుతూహలంతో..మల్లికార్జున రావు గారు మొగలిచెర్ల కు వచ్చారు..
    "శ్రీ స్వామివారు తీవ్ర సాధన లో ఉన్నారనీ..ఎవ్వరినీ కలవ వద్దన

Komentáře • 42