*మర్సుమల్లి-తోలుకోడు*:-గ్రామస్థాయిలో జనసేనపార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రచ్చబండ- శీలం బ్రహ్మయ్య.

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • *మర్సుమల్లి-తోలుకోడు*:- జనసేనపార్టీ ఆధ్వర్యంలో మర్సుమల్లి,తోలుకోడు గ్రామలలో రచ్చబండ కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జనసేనపార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ)గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో జనసేనపార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని,యువత అందరూ కూడా బాధ్యతతో కూడిన రాజకీయం చేయాలని సూచించారు.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరియు పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, తద్వారా బూత్ స్థాయిలో జనసేనపార్టీని బలపరుస్తూ, ఓటింగ్ జరిగే విధంగా చూడాలని కోరారు.ఈ సందర్భంగా గ్రామంలోని కార్యకర్తలు కొన్ని సమస్యలు ప్రస్తావించగా,సమస్యల పరిష్కారం కొరకు జనసేనపార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ మైలవరం,రెడ్డిగూడెం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య,చాపల మడుగు కాంతారావు,మండల ఉపాధ్యక్షులు పాములపాటి సుందర్ రామిరెడ్డి,మండల కమిటీ సభ్యులు సిరివెళ్ల వర్మ,సుంకర సత్యనారాయణ, ఈతకొట్టు నాని,కూసుమంచి కిరణ్ కుమార్,ఆనం విజయ్,తోట క్రాంతి బాబు,చిట్టిమాద వెంకటకృష్ణ మరియు నాయకులు వీర్ల పౌల్ రాజ్,కస్తాల రవి,వసంతరావు, గాంధీ,ఆకుల విజయేంద్ర వర్మ, మల్లెల తేజకృష్ణ మరియు తోలుకోడు,మర్సుమల్లి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

Komentáře • 1